దావత్-ఏ-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ.

Spread the love

: గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ గెలిపించుకోవాలి.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖమ్మం నియోజకవర్గ కేంద్రం సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ విందు లో హోం మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి మహమూద్ అలీ అన్నారు. విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.


సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడా లేవన్నారు. గురుకుల పాఠశాలలు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతోపాటు సాగు, తాగునీరు ఇస్తూ పెట్టుబడి సాయంగా రైతుబంధు రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గారు అని అన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి గా చేసుకునే బాధ్యత మన పై ఉందని, ఖమ్మం లో పువ్వాడ అజయ్ కుమార్ ని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించారు. అనంతరం విందు భోజనాలు వడ్డించి, వారితో పాటు కలిసి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page