కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేద్దాం..

Spread the love

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

సిద్ధిపేట;
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కృషి చేద్దామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ అన్నారు. హైదరాబాదులో బుధవారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆత్తు ఇమామ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కానుక ఇద్దామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన దానికంటే ఎక్కువ బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందని అందరం సమిష్టిగా కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page