హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

Spread the love

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలు సంజీవ రెడ్డి మరియు బి.కృష్ణ ముదిరాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డివిజన్ పరిధిలోని ధరణి నగర్లో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.డాక్టర్.జి రంజిత్ రెడ్డి కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్, సంగమేష్, అగ్రవాసు, బాలస్వామి, పి.రాజబాబు, మహీందర్ రెడ్డి, సత్యనారాయణ, గోపాల్, చారి, రాజు యాదవ్, వెంకటేశ్వరరావు, అంథోనీ రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్ గుప్తా, ప్రసాద్, కాపా శ్రీనివాస్, మహేష్, మీసాల జనయ్య, సన్యాసిరావు, బాలస్వామి సాగర్, ప్రకాష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, రాజ్యలక్ష్మి, శ్యామల, సూర్యకుమారి, పర్వీన్, యస్మిద్, మహముదా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ మరియు బస్తి కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page