కాలుష్య పీడిత గ్రామాలకు అండగా నిలబడదాం

Spread the love

కట్టుబడిపాలెం గ్రామ అనారోగ్య సమస్యలపై రాష్ట్ర బిజేపి అధినేత్రి స్పందన…!!

రాష్ట్ర బిజేపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసిన మైలవరం బిజేపి కన్వీనర్ కుక్కపల్లి…!!

గ్రామాల ప్రజలతో ముఖా ముఖి సమావేశం నిర్వహించాలని నేతలకు సూచన…!!

మైలవరం: కొండపల్లి పారిశ్రామిక వాడ విడుదల చేస్తున్న రసాయన వ్యర్థాలతో అనారోగ్య సమస్యలతో గ్రామాల ప్రజలు బాధపడుతున్నట్టు రాష్ట్ర బిజేపి నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురoధేశ్వరి దృష్టికి వెళ్లింది.. మైలవరం నియోజకవర్గ బిజేపి కన్వీనర్ కుక్కపల్లి నాగేశ్వరరావు కాలుష్య సమస్య పై రాష్ట్ర అధ్యక్షులు కు పూర్తి వివరాలు తెలిపారు. కాలుష్య కోరల్లో చిక్కుకుని కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్నట్లు వాస్తవ పరిస్థితిని వివరించారు. కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పక్షాన బిజేపి నిర్విరామ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.. ఈ సమస్య పై స్పందించిన బిజేపి అధినేత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామాల ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. త్వరలో గ్రామాల ప్రజల తో తాను ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ కన్వీనర్ కుక్కపల్లి నాగేశ్వరరావు ను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page