జగిత్యాలలో ఘనంగా ఉగాది ఉత్సవం జరుపుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకులు

Spread the love

విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది ఉత్సవం సందర్భంగా పచ్చడి మరియు బూరెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా నీలగిరి వికాస్ రావు ఉగాది యొక్క విశిష్టతను వివరించారు. ప్రకృతిలో మార్పులతో వచ్చే ఉగాది నూతన సంవత్సర ఆరంభం అవుతుందని, శిశిర రుతువు పోయి వసంత రుతువులోకి అడుగుపెడుతుందని, ఉగాది అన్ని శుభకార్యాలకు ప్రారంభము అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ACS రాజు, కాశీ నాదం, ప్రసాద్ రావు, నీలగిరి వికాస్ రావు, పట్టణ అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్ కుమార్, జిల్లా సహా కార్యదర్శి సంతోష్, జిల్లా కోశాధికారి రాములు, బిట్టు, మైలారపు పవన్, మైలరపు భార్గవ్, సాయి ప్రసాద్, పరందం, పట్టణ కౌన్సిలర్ లు గుర్రం రాము, పృథ్వి, రాజు కుమార్, ప్రశాంత్, రామ్ మోహన్ రావు, వేముల సంతోష్, పదం మహేందర్, ప్రణీత్ , కొండాపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page