SAKSHITHA NEWS

ఎల్. బి నగర్ ప్రజా సమస్యలపై రోజురోజుకు విస్తృతంగా పాదయాత్ర చేపడుతున్న,
ఎల్. బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,
జక్కిడి ప్రభాకర్ రెడ్డి …

మూడవ రోజు ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా….
వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్య కాలనీలో,జంగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి,
అనంతరం కృష్ణానగర్, శక్తి నగర్, వెంకటరమణ కాలనీ, శ్రీనివాసపురం కాలనీ,ప్రభుత్వ ఆసుపత్రి మరియు రెడ్ ట్యాంక్ ఏరియా మరియు ప్రశాంత్ నగర్,అభ్యుదయ నగర్, ఎస్ఎఫ్ఐ కాలనీ మీదుగా జాంగిర్ నగర్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు….

ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ….
అవస్థల వనస్థలిగా… డివిజన్ మారిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై మండిపడ్డారు….
వనస్థలిపురం హుడా ఓపెన్ ఆడిటోరియం మినీ రవీంద్ర భారతి గా మారుస్తానన్న సుధీర్ రెడ్డి హామీ నేటికీ ఆచరణ సాధ్యం కాలేదన్నారు….
వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో అదనపు అంతస్తు నిర్మించి లిఫ్ట్ సౌకర్యం కల్పించి రోగులకు మెరుగైన సేవలందించాల్సింది పోయి…
సరిపోను వైద్య సిబ్బంది లేకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు….
అదేవిధంగా గుంటి జంగయ్య కాలనీలో డ్రైనేజీ సమస్యలు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయని అన్నారు….


వచ్చే ఎన్నికల్లో ఈ దగాకోరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పి,
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని, ప్రతి సమస్యలను పరిష్కరించుకుందామని ప్రజలకు తెలిపారు….
ఈ కార్యక్రమంలో గుంటి జంగయ్య కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, మహిళా నాయకులు భాను, రాణి, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS