కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 1000 మండి బి‌ఆర్‌ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్వర్యంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి మరియు టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమం పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజారంజక పాలన పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు.పార్టీలో చేరిన కొత్త నాయకులు మరియు పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన నాయకులందరూ కలిసికట్టుగా పని చేసి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించుకుని రేవంత్ రెడ్డి కి కానుకగా అందచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,ఆవుల పావని జగన్ యాదవ్ ,రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ,కోలన్ వీరేందర్ రెడ్డి,G. శ్రీనివాస్ యాదవ్,ప్రసన్న జగదీష్ యాదవ్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యురాలు వాణి స్టీఫెన్ పాల్, NMC కాంగ్రెస్ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు ఇందిరా,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మహిళా జెనరల్ సెక్రెటరీ రఫియా బేగం,సీనియర్ నాయకులు చల్లా సుధీర్ రెడ్డి,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,నాగరాజ్ యాదవ్, ఆశి మల్లేష్,తలారి సాయి ముదిరాజ్,సురేందర్ కుమార్ యాదవ్,మహేందర్,సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు,ఇతర ముఖ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page