కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు

Spread the love

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు….

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు….

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో నిరుపేదలకు తమవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఖార్డ్ సంస్థ వారు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు…నిరుపేదలకు నిత్యావసరాలు అందించేడమే కాకుండా వారు ఆర్దికంగా ఉన్నతి సాధించాలనే ఉద్దేశంతో ఖార్డ్ సంస్థ అధినేత సుమన్ తో చర్చించి నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల్లోని మహిళలకు ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపారు…అంతే కాకుండా ట్రైనింగ్ అయ్యాక తన సొంత నిధులతో మరియు ఖార్డ్ సంస్థ తో కలిసి మహిళలకు కుట్టు మిషన్ లని పంపిణీ చేయడమే కాకుండా వారికి ఉపాధి మార్గాలు చూపించే బాధ్యత తమదే అని అన్నారు… అలాగే కూకట్పల్లి నియోజకవర్గం లో తన సొంత నిధులు 44 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అంబులెన్స్లను ఆపదలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు… భవిష్యత్తులో ఖార్డు సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళతామని అన్నారు… ఈ కార్యక్రమంలో ఖార్డ్ సంస్థ చైర్మన్ సుమన్… ముసపెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్… తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page