కొత్తపల్లి శ్రీ మాణికేశ్వరి మాత 19వ వార్షికోత్సవ గోడ పత్రికను విడుదల చేసిన ఆలయ కమిటీ

Spread the love

శంకర్‌పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల శ్రీ మాణికేశ్వరి మాత పాదుక ప్రతిష్ట 19వ వార్షికోత్సవం ఈనెల 16వ తేదీన జరగనుంది. ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు రథసప్తమి సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 14వ తేదీ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, 15వ తేదీ గణపతి హోమం, 16వ తేదీ అన్నదాన కార్యక్రమం, 17వ తేదీ గాయత్రి యజ్ఞం, అమ్మవారి పాదపూజలో పాల్గొనే భక్తులు రూ. 1100 చెల్లించాలన్నారు. కార్యదర్శి డా. హరి శంకర్, ఆంజనేయులు, బారలింగం, విశ్వంచారి, మాణిక్యం చారి, లింగారెడ్డి, నరసింహులు, హనుమంత్ రెడ్డి, పెంటయ్య, ప్రభు, వెంకటేష్, భూషణం, ఆనందం, నరసింహులు గౌడ్, రామచంద్రయ్య, సంగమేశ్వర్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page