కూకట్ పల్లి ఓమ్ని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం

కూకట్ పల్లి ఓమ్ని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం

SAKSHITHA NEWS

స్వతంత్ర భారత వజ్రొత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ లో కూకట్ పల్లి ఓమ్ని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి
భాగంగా దాదాపు 75 మందికి పైగా NMC అధికారులు, మరియు సిబ్బంది కార్పొరేషన్ లోని ప్రజలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా మేయర్ చేతుల మీదుగా 25 సార్లు రక్తదానం చేసిన బాలరాజు ను ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించి,మెమెంటో ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,గాజుల సుజాత,G. శ్రీనివాస్ యాదవ్,సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, ఓమ్ని హాస్పిటల్స్ డాక్టర్ వాసుదేవ్, NMC అధికారులు, మరియు సిబ్బంది,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS