కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో నిర్మిస్తున్న వొకేషనల్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే…

Spread the love

కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో నిర్మిస్తున్న వొకేషనల్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద స్వర్గీయ కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో చేపడుతున్న వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులు అధికంగా ఉండడంతో వారికి ఉపయోగపడే విధంగా వొకేషనల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందని, తన తండ్రి స్వర్గీయ కేఎం పాండు జయంతి సందర్భంగా భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. త్వరలోనే మొదటి అంతస్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకొని వేగంగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి, దుండిగల్ వైస్ చైర్మన్ టి.పద్మారావు, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, సీనియర్ నాయకులు మన్నె రాజు, వారాల వినోద్, చౌడ శ్రీనివాస్ రావు, మన్నె బాలేష్, పద్మారావు, సిద్దిక్, మధు మోహన్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page