కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

అనంతరం కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా నా ఓటమితో అధైర్పడవద్దని నా గెలుపు కోసం ప్రతి కార్యకర్త తమ శక్తి వంచన లేకుండా పనిచేశారని తెలిపారు . మనం ఇక్కడ గెలవక పోయినప్పటికీ ఇక్కడ మనము ప్రతిపక్షంగా పోరాడుతామని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఏ కాంగ్రెస్ కార్యకర్త నిరుత్సాహ పడరాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇక్కడ మనము అభివృద్ధి సాధిస్తామని రాబోవు ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు, సీనియర్ మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page