SAKSHITHA NEWS

హైదరాబాద్: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత వెల్లడిస్తామని డీజీపీ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కిషన్ రెడ్డి.. ఇంత హంగామా జరుగుతున్నా.. ఏ కేసులో సంజయ్ ను అరెస్టు చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. మీరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం” అని వ్యాఖ్యానించారు.


SAKSHITHA NEWS