రాహుల్ గాందీ పై బీజేపీ నాయకులు పెట్టిన తప్పుడు కేసులను ఖండిస్తు నిరసన ర్యాలి.!!!

Spread the love

రాహుల్ గాందీ పై బీజేపీ నాయకులు పెట్టిన తప్పుడు కేసులను ఖండిస్తు నిరసన ర్యాలి.!!!

_
సాక్షిత : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం:ప్రజలు కోసం కేసులు ఎదుర్కోవడం,జైళ్లకు వెళ్లడం రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్తేమి కాదని నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆదేశాలమేరకు స్ధానిక కాంగ్రెస్ పార్టి కార్యాలయం నుండి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలి చేపట్టారు.అనంతరం యర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ చేస్తున్న అవినీతి అక్రమాలను రాహుల్ గాంధీ ఎదురిస్తున్నాడనే అక్కసుతో రెండేళ్ల జైలు శిక్ష పడేలా న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు.ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి రాహుల్ కాదని ఆయన తండ్రి,తాత,ముత్తాతలంతా ప్రజల కోసం జైలు జీవితం గడిపినవారేనని గుర్తు చేశారు.స్వాతంత్య్రం కోసం 17 ఏళ్లు కటిన కారాగార శిక్ష అనుభవించిన చరిత్ర నెహ్రుదేనని అన్నారు.అయితే రాహుల్ పై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టేలా చూడటం దుర్మార్గమని రాహుల్ గాంధీకి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా తాము తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలిపారు

తామంతా రాహుల్ వెనుకే ఉంటామన్నారు.తక్షణం పెట్టిన తప్పుడు కేసులను బీజేపీ నాయకులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఏఐసీసీ యువ నాయకులు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు పరువు నష్టం కేసు వేసిన వెంటనే పూర్వాపరాలు పరిశీలించకుండా సూరత్ జిల్లా కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం విడ్డూరంగా ఉందని,ఇది భారతదేశ న్యాయ చరిత్రలోనే అతి దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు.మోడీ చేసిన నియంతృత్వ పాలనతో ప్రజలు ఎలా తీవ్రంగా నష్టపోయారో దేశ ప్రగతి ఏరకంగా దిగజారిపోయిందో అని విమర్శించినందుకు జైలుకు వెళ్లాలంటే మళ్ళీ మళ్ళీ విమర్శిస్తామని అందుకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశంలో మరియు రాష్ట్రంలో అలాగే జిల్లాలో ఉన్న లక్షల మంది కాంగ్రెస్ నాయకులు కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలియజేశారు.

జైలుకెళ్లడానికి క్షమాపనలు చెప్పి పారిపోవడానికి తాము సావర్కర్ వారసులం కాదని ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన కాంగ్రెస్ వారసులని మరోసారి గుర్తు చేశారు.రాహుల్ గాంధీపై అన్యాయంగా విధించిన రెండు సంవత్సరాలు జైలుశిక్షను తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేడ్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రకారం న్యాయ పోరాటం కోసం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సెక్రెటరీ అన్నలదాసు ప్రవీన్ కుమార్ ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి యర్రగొండపాలెం నియోజకవర్గ సోషల్ మీడీయా కన్వినర్ సొంటి శ్రీనివాసరెడ్డి యర్రగొండపాలెం మైనార్టీ సెల్ నాయకులు షేక్ పఠాన్ అబ్ధుల్ కలామ్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page