SAKSHITHA NEWS

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు కేసీఆర్.
కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బహిరంగ సభ నిర్వహించి.. ఉద్యమాన్ని మరింత ఉద్ధ్రుతం చేస్తామని ప్రకటించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు తెలివి లేదని విమర్శించారు.

బీఆర్ఎస్ కి పోరాటం కొత్త కాదన్నారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. ఇప్పుడు అవగాహన లేక దీని వల్ల నష్టాన్ని ప్రజలకు చెప్పాలి.నది జలాలపై తెలంగాణ హక్కుల కోస ఎంత కాడికైనా పోరాడుతామని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS