కట్టమైసమ్మ అమ్మవారికి ఘటం కుండ సమర్పణ….

Spread the love

కట్టమైసమ్మ అమ్మవారికి ఘటం కుండ సమర్పణ…..
సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా చెరువు కట్ట అలుగు తెరుచుకోవడంతో గ్రామ ప్రజలు అందరూ కలిసి అమ్మవారికి ఘటం కుండ తో స్వాగతం పలికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు సుభాష్ రెడ్డి , సురేందర్ రెడ్డి , రవికాంత్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , మన్నె షేకర్ , మన్నె బాలరాజు మరియు గ్రామ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page