కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం

Spread the love

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం….

కర్ణాటక ఎన్నికల ఫలితాలే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పునరావృతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని శనివారం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కర్ణాటక ప్రజలు అధికార పార్టీ దొంగ హామీలతో , అక్రమాలతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి గెలిపించారని అందుకు కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా BRS నాయకుల ఆగడాలు, అక్రమాలు, దొంగ హామీలు చూసి విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ దగా కోరు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, తమ పార్టీ కార్యకర్తలే పార్టీకి బలమని కార్యకర్తలు ధిమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళ నాయకురాళ్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page