జన నీరాజనాల మధ్య సాగుతున్న కందుల పాదయాత్ర. * మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర 8 వ రోజుకు చేరింది. ఈరోజు మేకల వారి పల్లి, ఓబయపల్లి, లక్ష్మక్క పల్లి, కొండారెడ్డిపల్లి, మంగలకుంటలో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. పాదయాత్రలో ఈరోజు ఒబాయపల్లి నుండి లక్ష్మక్క పల్లి మార్గమధ్యంలో భారీ వానను సైతం లెక్కచేయకుండా నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్లో పెట్టిన 100 కోట్లతోనే వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులకు అన్యాయం జరిగిందని 3500 కోట్లు వెలుగొండ ప్రాజెక్ట్ క పూర్తికి అవసరమని ఇక ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం అసాధ్యమని తేలిందని అందువల్లే నియోజకవర్గ ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర చేపట్టనని మార్కాపురం జిల్లా కోసం అనేక పోరాటాలు చేశాను అని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో లోపు మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయిస్తానని అన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలని నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని ఈ సందర్భంగా పాదయాత్రలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉందని కరెంటు కూడా రాత్రి అయితే ఉండడం లేదని తెలియజేశారు. **కొండారెడ్డిపల్లి గ్రామంలో 10 వైసీపీ కుటుంబాలు మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Related Posts
Spread the love ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన…
Spread the love ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదయిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ…
Spread the love తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ…
Spread the love కోవురు నియోజకవర్గ ప్రజలతో అతి తక్కువ కాలంలోనే మమేకం అవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్న ఎన్నికల ప్రచారం మరియు విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, స్నేహితులకు, నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి…
Spread the love గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరులో జిల్లా ప్రజల మన్ననలు పొందిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ . గత కొన్ని రోజులుగా ముందస్తు పక్కా ప్రణాళికతో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముందుండి…
Spread the love మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి…
Spread the love ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని…
Spread the love పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్…
Spread the love నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్లలోని వెబ్ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.
Spread the love తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.