జన నీరాజనాల మధ్య సాగుతున్న కందుల పాదయాత్ర.

Spread the love

జన నీరాజనాల మధ్య సాగుతున్న కందుల పాదయాత్ర. * మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర 8 వ రోజుకు చేరింది. ఈరోజు మేకల వారి పల్లి, ఓబయపల్లి, లక్ష్మక్క పల్లి, కొండారెడ్డిపల్లి, మంగలకుంటలో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. పాదయాత్రలో ఈరోజు ఒబాయపల్లి నుండి లక్ష్మక్క పల్లి మార్గమధ్యంలో భారీ వానను సైతం లెక్కచేయకుండా నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్లో పెట్టిన 100 కోట్లతోనే వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులకు అన్యాయం జరిగిందని 3500 కోట్లు వెలుగొండ ప్రాజెక్ట్ క పూర్తికి అవసరమని ఇక ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం అసాధ్యమని తేలిందని అందువల్లే నియోజకవర్గ ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర చేపట్టనని మార్కాపురం జిల్లా కోసం అనేక పోరాటాలు చేశాను అని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో లోపు మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయిస్తానని అన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలని నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని ఈ సందర్భంగా పాదయాత్రలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉందని కరెంటు కూడా రాత్రి అయితే ఉండడం లేదని తెలియజేశారు. **కొండారెడ్డిపల్లి గ్రామంలో 10 వైసీపీ కుటుంబాలు మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page