SAKSHITHA NEWS

దేవరపల్లి రహదారిని సందర్శించిన–కలిశెట్టి
04-09-2023

ఎచెర్ల నియోజకవర్గం పరిధి రణస్థలం మండలంలో గల దేవరపల్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది.ఈ రహదారి దుస్థితిని తెలుసుకునేందుకు సోమవారం తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర శిక్షణా తరగతుల శిబిరం మాజీ డైరెక్టర్ మరియు ఎచెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు గారు దేవరపల్లి గ్రామాన్ని సందర్శించారు.రాకపోకలకు సౌకర్యంగా లేని,అధ్వానంగా పెద్ద పెద్ద గోతులతో ఉన్న రోడ్డు దుస్థితిని కలిశెట్టి అప్పలనాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు,అభిమానులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ దేవరపల్లి రోడ్డు దుస్థితిని గురించి గతంలో ఎన్ని దాపాలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, ఇదే రహదారిపై తప్పనిసరిగా రాకపోకలు సాగించే వృద్ధులు, మహిళలు,విద్యార్థులు, కూలీలు,రోగులు తదితరు వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారు కలుగజేసుకొని,దేవరపల్లి రహదారిని తాత్కాలిక మరమతులైన చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు…


SAKSHITHA NEWS