జర్నలిస్టులకు న్యాయం చేస్తా

Spread the love

హామీ ఇచ్చిన రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఏసీపీని కలిసిన జర్నలిస్టు ప్రతినిధుల బృందం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్

కారేపల్లి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు గైరాజరవుతున్న నేపథ్యంలో పలు పత్రికలలో వార్తలు రావడం జరిగింది. ఇట్టి విషయమై ఈనెల 18న అదే కారేపల్లి పాఠశాలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేత ఇరువురి విలేకరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి జర్నలిస్టులకు న్యాయం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రతినిధుల బృందం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డిని కలిశారు. అందుకు స్పందించిన రూరల్ ఏసిపి మరోమారు విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్, భాస్కర్, మందుల ఉపేందర్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ జానీపాషా, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష, కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, సాయి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, జిల్లా నాయకులు రోసిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page