SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ పరిధి 18వ వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు పల్పునూరి బల్వంత్ రెడ్డి, చౌదరి సిగ్నేశ్వర్ రెడ్డి, 17వ వార్డుకు చెందిన కాసాని బాలకృష్ణ లు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో శంభీపూర్ కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS