జోహార్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్.

Spread the love

వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. కుల వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పాలన అందిస్తామని తెలిపారు. రాజకీయాల్లో కూడా అనగారిన వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ, మంత్రివర్గం లో ఎక్కువ మంది కి మంత్రి పదవులు ఇచ్చి, నిజమైన సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి . పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందాలని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, ఇంగ్లీషు మీడియం విద్య ను అందిస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తుచేశారు. అలాగే అంబేద్కర్ కలలు కన్న ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి ని తెలిపారు.

వినుకొండ కు కూడా గత పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక ప్రభుత్వం పై అసత్య ప్రచాలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Whatsapp Image 2023 12 06 At 1.19.26 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page