ఎండి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని:జిట్టా నగేష్

Spread the love

సాక్షిత చిట్యాల :
ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఎం డి జహంగీర్ ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ రైతుల, కూలీల, మహిళల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే జహంగీర్ ను పార్లమెంటుకు పంపించాలని కోరారు. అవకాశవాద, అవినీతికర పార్టీల అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడించి, కమ్యూనిస్ట్ అభ్యర్థులను గెలిపించాలని నగేష్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ చొప్పరి సంధ్యారాణి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాలమాకుల అర్జున్, బొబ్బలి వెంకట్ రెడ్డి, దామ రోజు పోతులూరి, గుండెబోయిన సాయి, చొప్పరి నాగ పణి, కర్నెకంటి లింగయ్య, జ్యోతి, బొబ్బలి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page