కె.పి వివేకానంద్ సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న జానయ్యా..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు బీజేపీ సీనియర్ నాయకులు జానయ్యా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మేల్యే కె.పి. వివేకానంద్ సమక్షంలో బీఅర్ఎస్ పార్టీ లో చేరారు, ఈ సందర్బంగా ఎమ్మేల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని దేశంలో బిజెపి ప్రభుత్వంలో అణిచివేతకు గురవుతున్న దళితులను గౌరవించి వారిని సంఘంలో గౌరవప్రదంగా జీవించేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం.

సంక్షేమ పథకాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంగా నిలిపిందని ఎమ్మెల్యే తెలిపారు బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందని వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్, నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అద్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సత్తి రెడ్డి,మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభ, డివిజన్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page