మైలవరంలో జగనన్నే మా భవిష్యత్తు

Spread the love

మైలవరంలో జగనన్నే మా భవిష్యత్తు.

కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని మైలవరంలోని చంద్రబాబునగర్లో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు.

ఇంటింటికీ వెళ్తూ జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని గురించి వివరించారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా, ప్రజలను మోసం చేసిన వైనాన్ని సమగ్రంగా వివరించారు. ప్రజా మద్దతు పుస్తకంలో పలు ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు. అనంతరం వారి అనుమతితో సెల్ ఫోన్లకు స్టిక్కర్లను, తలుపులకు ప్రత్యేకంగా స్టిక్కర్లను అతికించారు. అన్ని చోట్లా పార్టీ శ్రేణులు ఇందులో మమేకమై ఏప్రిల్ 20వ తేదీ లోపు కార్యక్రమాన్ని ముగించాలని పిలుపునిచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page