నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్

Spread the love

నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్”

ఎన్టీఆర్ జిల్లా,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

గొల్లపూడిలో “జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వాలంటీర్లకు, సచివాలయ కన్వీనర్లకు, గృహసారథులకు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ “జగనన్నే భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగనన్న” అనే వాల్ పోస్టర్లను, స్టిక్కర్లను ఆవిష్కరించారు.

ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రెండు వారాల వ్యవధిలో పార్టీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి గత ప్రభుత్వానికి, మన సీఎం జగనన్న సారథ్యంలోని పాలనకు, విధి, విధానాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్లను వారి అనుమతితో తలుపులకు అతికించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, 82960 82960 కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వైకాపా శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జగనన్న సైన్యం అంతా ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

“మా నమ్మకం నువ్వే జగనన్న” అనే నినాదం ప్రజల నుంచి వచ్చిందన్నారు. సీఎం జగనన్న పాలనలో పేద ప్రజల ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా తిప్పికొట్టాలన్నారు.జగనన్న సంక్షేమ రథానికి అడ్డుపడే ప్రయత్నాలకు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు ఈ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుందన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page