నిత్యం ఆచరణీయం… స్వామి వివేకానంద చూపిన మార్గం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

Spread the love

127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జల్దా లక్ష్మీ నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద , స్థానిక కార్పొరేటర్ బి విజయ శేఖర్ గౌడ్, బాలానగర్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు లతో కలిసి హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించగా 125 మంది రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బలమే జీవితం… బలహీనతయే మరణం అంటూ లాంటి ఎన్నో సూక్తులు యువతను బలహీనతను అధిగమిస్తూ నిత్యం మానసికంగా దృఢత్వంగా తయారయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద చూపిన మార్గాన్ని ఆచరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య,
సీనియర్ నాయకులు ఓంకార్ రెడ్డి, కాపా సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, కార్తీక్ గౌడ్, సత్యనారాయణ, ఆనంద్, కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి,లయన్స్ క్లబ్ ప్రతినిధులు పీవీ.రాజన్, సాయి గౌడ్, తిమ్మయ్య, శ్రీనివాస్, రాజి రెడ్డి, నీలగిరి, ఎల్లయ్య, నాగరాజు,చోటు, అలావుద్దీన్, రమ్మి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 12 At 1.59.07 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page