నూతన పింఛన్లు పంపిణీ చేసిన ఈశ్వర్ రెడ్డి

Spread the love

Ishwar Reddy distributed new pensions

నూతన పింఛన్లు పంపిణీ చేసిన ఈశ్వర్ రెడ్డి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం అలాగే లక్ష్మీపురం పంచాయితీకి సంబంధించి వైస్సార్ పింఛన్ కానుక నూతన పింఛన్లు ను సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, కాగితాల కృష్ణారెడ్డి,చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా పింఛన్లు సొమ్ము పెంచడంతో పాటు నూతన పింఛన్లు మంజూరు చేయడంతో రాష్ట్రంలో పింఛన్లు పండగ జరుగుతుందని అన్నారు.కొత్తగా 2750 పింఛన్ సొమ్ము పెరిగిందని లక్ష్మీపురం పంచాయతీ మొత్తము పింఛన్ 372 అందులో కొత్తగా 8 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు.
జగనన్న ప్రభుత్వంలో రాజకీయ బేధాలు లేకుండా అన్ని పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నారని.మంజూరైననూతన పింఛన్ ను సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగా వారికి అందజేశారు..
ఈ కార్యక్రమంలో సర్పంచి ఎంపీటీసీ వైస్సార్ కాంగ్రెస్ నాయకులు,పార్టీ శ్రేణులు,గ్రామ సచివాలయం కన్వీనర్లు,గ్రామ సచివాలయం సిబ్బంది,పంచాయతీ కార్యదర్శి, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page