శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యే కి ఆహ్వానం

Spread the love

శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యే కి ఆహ్వానం

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా నిజాంపేట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని ఘనంగా సన్మానించారు

. శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు వారి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు రాజ్ మోహన్ రెడ్డి, నాగరాజ్ యాదవ్, సాయి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page