మేయర్ చే ఎస్పీ మెస్ ప్రారంభం

Spread the love

తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ మెస్ ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. స్థానిక కరకంబాడి రోడ్డులోని డి మార్ట్ పక్కన రెడ్డిగుంటలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భోజనం ఆహార పదార్థాలు సరఫరాలో విశేషాలు అనుభవం గడించిన నాగరాజు యాదవ్ బృందం పీకే లేఅవుట్ లో గత కొన్ని సంవత్సరాలుగా క్యాటరింగ్ సంస్థను నిర్వహిస్తోందన్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించాలని ఉద్దేశంతో కరకంబాడి మార్గంలో ఎస్పీ మెస్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

ఆ సంస్థ అధినేత నాగరాజ యాదవ్ మాట్లాడుతూ సమావేశంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్ని రకాల అల్పాహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. మధ్యాహ్నం భోజనం చికెన్ బిర్యాని కూడా ఆహార ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అన్ని రకాల శాఖాహారం మాంసాహార పదార్థాలు మా వద్ద లభిస్తాయని తెలిపారు. దీని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాధాకృష్ణ, అనిల్ కుమార్, లక్ష్మీ యాదవ్, మహేష్ యాదవ్, పండు యాదవ్, ముని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page