దినేష్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి

Spread the love

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మౌలిక సదుపాయాలు కరువు

ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం

111వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్రలో భాగంగా కోవూరు మండలం మసీద్ సెంటర్లో దినేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు, పడుగుపాడుపర్యటించి “బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ” పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఇల్లు తిరిగి రిజిస్ట్రేషన్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంత లబ్ధి చేకూరుతుంది అని తెలియజేయడం జరిగింది. అనంతరం మైనార్టీ యువత 40 కుటుంబాలు ఎస్.కె షాధిక్, మల్లారెడ్డి ఆధ్వర్యంలో దినేష్ రెడ్డి సమక్షంలో కండవాలు కప్పించుకొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు,

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లిం సోదరుని మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసం చేసిందని మన ప్రభుత్వంలో రంజాన్ పండుగ రోజు రంజాన్ తోబ మసీదులు మరమ్మతులు కోసం 25 వేల నుంచి 50 వేల వరకు ఇచ్చిన ఘనత మనది, ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో అన్ని మోసపూరితమైన వాగ్దానాలు చేసి అందర్నీ ఇబ్బందులకు గురిచేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి మనందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ఘనవిజయంగా గెలిపించుకొని మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుని కోవూరులో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగరేద్దాం అని అదేవిధంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మంచి స్థానం కల్పిస్తామని ఈ ఐదేళ్లు మీతోనే ఉంటాను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో.. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, బాలరవి,చెంబేటి పెంచలయ్య, సూర్యశెట్టి శ్రీనివాసులు, ముక్కోటి అమర్నాథ్ నాయుడు, షేక్ ఫిరోజ్, సయ్యద్ మసూద్ అహ్మద్, రహీం, పఠాన్, నజీర్, టిడిపి కుటుంబ సభ్యులు, భారీగా మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page