87వ వార్డులో 66.89 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

Spread the love

87వ వార్డులో 66.89 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
అభివృద్ధి, సంక్షేమమే సీ.యం జగన్ లక్ష్యం
శాసన సభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి

87వ వార్డులో 66.89 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, కణితి కాళింగ వీధిలో రూ.19.89 లక్షల వ్యయంతో వి.ఆర్.సీ.సీ డ్రెయిన్స్, కణితి ముస్లిం వీధిలో రూ.41 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్, గణేష్ నగర్ లో 6 లక్షల వ్యయంతో సీ.సీ డ్రెయిన్స్ మరియు కల్వర్ట్లు నిర్మిస్తున్నామని అన్నారు .

అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు, అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందేలా సీ.యం వై.యస్ జగన్మోహన్ రెడ్డి పరి పాలన చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో 87 వార్డు ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు, ప్రగడ వేణుబాబు,బొడ్డ గోవింద్,కోమటి రమాదేవి, ఎన్నేటి రమణ, దుగ్గపు దానప్పలు, ముద్దపు దామోదర్, జెర్రి పోతుల ఈశ్వరావు,ఆడారి శ్రీను, చొప్ప శ్రీను, వియ్యపు నానీ, శీరపు పాపారావు, బొండా గోవిందరాజు, భ్రమ్మాజీ శృంగవరపు, కోటి రెడ్డి, అమ్మాజీ, అప్పానమ్మ,దాకా కృష్ణ, ప్రగడ గోవిందరాజులు,ప్రగడ శంకరరావు, బుగిడి రామలక్ష్మీ, రమేష్ జకారియాస్ , ప్రగడ రాము, కొన్న నారాయణ, వేముల వెంకన్న,రహీం, ఆలీ,చేకూరి హరీష్ వర్మ, కోన సోమినాయుడు, కుంద్రపు అప్పారావు, కర్రీ అంజి, బొడ్డు సుమంత్, కాండ్రేగుల మనోహర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page