రాయదుర్గం ముస్లిం బస్తీ లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయం

Spread the love

In Raydurgam Muslim Basti Rs. Estimated cost is Rs 25 lakhs

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ముస్లిం బస్తీ లో రూ. 25 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను GHMC ఇంజినీరింగ్ విభాగం అధికారులు మరియు మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం ముస్లిం బస్తీ లో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు ను GHMC అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ముస్లిం బస్తీ లో సీసీ రోడ్ల ను వేసుకోవడం చాల సంతోషకరం అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని, అదేవిధంగా కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,

నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని

,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ గారు పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్ DE విశాలాక్షి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరియు తెరాస నాయకులు దారుగుపల్లి నరేష్, రమేష్, జగదీష్, సల్లావుద్దీన్ ,అక్బర్ బాయ్ మరియు కాలనీ వాసులుతదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page