మార్కెట్ కమిటీ చరిత్రలో రైతన్నల శ్రేయస్సుకు శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

మార్కెట్ కమిటీ చరిత్రలో రైతన్నల శ్రేయస్సుకు శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

……..

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో (హరే కృష్ణ మూవ్ మెంట్) మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5 రూపాయలకే అన్నపూర్ణ భోజన పథకం ప్రారంభించారు.

▪️ ప్రతి సోమవారం మరియు గురువారం వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో రైతులకు 5 రూపాయలకే భోజనం ఉంటుందన్నారు.

▪️మన ప్రాంతంలో మార్కెట్ కమిటీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రైతుల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రైతులు మరియు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రైతులతో కలసి 5 రూపాయల భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page