SAKSHITHA NEWS

లక్ష్మీపురంలో గంగమ్మ ఒడికి గణనాథుడు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద గురువారం ప్రధానార్చకులు పి.సీతారాం మూర్తి ఆధ్వర్యంలో మహిళలు,నిర్వాహకులు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి ఘనంగా పూజలు చేశారు.అనంతరం15 కేజీలు లడ్డును వేలం పాటలో గాలి రమణారెడ్డి దంపతులు అలాగే గాలి బోడమ్మ ,అనే వ్యక్తి 29000 రూ.లు లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.అదే విధంగా గణపతి మండపం వద్ద సుమారు 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోర పార్వతి రెడ్డి,బీసీ హక్కుల సాధన కమిటీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చాట్ల రమణారెడ్డి,బోర అసిరి నాయుడు,కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS