వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుంటే టెంట్ వేస్తా…దీక్ష చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేసారు. తొమ్మిది ఏండ్ల కెసిఆర్ పాలనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఒక్క పేదవాడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పది లక్షల జనాభా ఉంటె, ఎన్ని డబుల్ రూమ్ ఇండ్లు నిర్మించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్హులైన పేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో అర్హులైన నిరుపేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ముందు టెంట్ వేసి దీక్ష చేస్తానని హెచ్చరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page