ఆదివారం రాత్రి హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో ఆదివారం రాత్రి హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఇట్టి శోభ యాత్ర శ్రీ రామలింగేశ్వర స్వామి( శివాలయం) దేవస్థానం నుండి వందలాది హనుమాన్ స్వాములతో ప్రారంభమయు మడేలేశ్వరయ్య ఆలయం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం, బద్ది పోచమ్మ గుడి, అభయాంజనేయ ఆలయం, బస్టాండ్ హనుమాన్ ఆలయం, భూలక్ష్మి మా లక్ష్మి మీదిగా వందలాది మంది మహిళలు భక్తులు ‘ కోలాటాలతో ‘ అంగరంగ వైభవంగా అర్ధరాత్రి వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంచముఖ హనుమాన్ దేవస్థానం అధ్యక్షుడు పొనగంటి మల్లయ్య, స్థానిక కౌన్సిలర్ లు దయ్యాల శ్రీనివాస్, భోగం సుగుణ( భోగం వెంకటేష్ ) మరియు రామలింగేశ్వర ఆలయ అధ్యక్షుడు సదాశివుడు, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ నిర్వహణ కార్యదర్శి ఆకుల రాజేందర్, కైలాసకోటి సమ్మయ్య, జక్కే రవీందర్, దొడ్డే శ్రీకాంత్, రత్నాకర్, పోచయ్య గురుస్వాములు మాగంటి భాస్కర్, ఆకుల మహేందర్, బోళ్ల సాయి, ముదాం తిరుపతి, కైలాసకోటి గణేష్ మరియు వందలాదిమంది ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page