గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

Spread the love

పార్లమెంట్ ఎన్నికల వేళ
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా గుత్తా కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్లగొండలో బీఆర్ఎస్కు భారీ దెబ్బ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…

Related Posts

You cannot copy content of this page