SAKSHITHA NEWS

CM ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) ద్వారా మంజూరు అయిన 24,00,000/- ఇరవై నాలుగు లక్షల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ *

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 70 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన 24,00,000/- ఇరవై నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని

ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోతుల రాజేందర్,బ్రిక్ శ్రీనివాస్, శ్రీనివాస్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్,అనిల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ చౌదరి, జోగిపేట భాస్కర్, శ్రీధర్ రెడ్డి, రఘునాథ్, అంకారావు, అనిల్, శ్రీశైలం , నర్సింగ్, నర్సింహ, కోటేశ్వరరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

CM

SAKSHITHA NEWS