SAKSHITHA NEWS

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలు
ఆనందోత్సవాలతో జరుపుకున్న చిన్నారులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్నారులు సాంప్రదాయ వస్త్ర వేషాధారణలతో నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలికారు. తొలత భక్తి శ్రద్ధలతో సరస్వతి దేవి, లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు దేవునిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పాఠశాలకు కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ శోభకృత నామ ఉగాది సంవత్సరంలో విద్యార్థులు చదువులో విజయం సాధించాలని, చిన్నారులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చింతనిప్పు సుకన్య,ప్రిన్సిపాల్ విజయకుమారి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS