ఘనంగా 78వ జయంతి వేడుకలు…

Spread the love

పాండు సార్ యాదిలో…

ఘనంగా 78వ జయంతి వేడుకలు…

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు స్వర్గీయ  కేఎం పాండు 78వ జయంతి సందర్భంగా చింతల్ లోని కేఎం పాండు మార్గ్ వద్ద ఉన్న భాపు విగ్రహానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన మహానాయడుకు స్వర్గీయ కేఎం పాండు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల్ రాజ్, రషీద్ బైగ్, గుమ్మడి మధు సూదన్ రాజు, జల్ద రాఘవులు, ఏసు రత్నం, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page