త‌మ‌ది పేద‌ల ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వ‌మ‌ని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు

Spread the love

జగ్గయ్యపేట పట్టణం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను స్వగృహంలో జగ్గయ్యపేట పట్టణం పద్మావతి నగర్ కు చెందిన 10మంది ప్రతిపక్ష టీడీపీని వీడి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట ఎమ్మెల్యే టిటిడి పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది.అనంతరం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ అణ‌గారిన వ‌ర్గాలకు పెద్ద పీట వేస్తూ వారి అభ్యున్న‌తికి తాము ఎంత‌గానో కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. పేద‌రిక నిర్మూల‌నే ధ్యేయంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న‌ను మెచ్చి ఇత‌ర రాజ‌కీయ పార్టీల నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేరుతున్నార‌ని వెల్ల‌డించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నార‌ని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ చెరుకుమల్లి రాంబాబు,ఉప్పెలి ప్రసాదు,మల్లెల సాయి,మారేపల్లి నాగేంద్ర,నిమ్మల గోపి తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page