ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *

Spread the love

సాక్షిత : ఐటి,పరిశ్రమల,పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *

బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ గాంధీ .

తెలంగాణ యువతరానికి ఆదర్శం, సకల గుణాభిరాముడు,తండ్రికి తగ్గ తనయుడు, జనహృదయ నేత, ప్రజలు మెచ్చిన నాయకుడు, ఐటి,పరిశ్రమల,పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి రక్తదానం శిబిరం ను ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మంత్రి , బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం ను పురస్కరించుకుని ఈ రోజు మహా రక్త దానం శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని ,స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, మంచి స్పందన వచ్చినది అని ,అన్ని దానంల కన్నా రక్తదానం గొప్పది అని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా తప్పనిసరిగా రక్తదానం చేయాలని, నిండు ప్రాణాలను కాపాడినవారు అవుతారు అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ గాంధీ . రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ఇతర ప్రాణాలు కాపాడిన దైవ సమానులు అవుతారు అని కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛంద గా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని , సుఖ సంతోషాలతో , నిండు నూరేళ్ల జీవించాలని, మరింత ప్రజా సేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ,. బడుగు బలహీన వర్గాలకు అండగా సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ దని పేర్కొన్నారు. మంత్రివర్యులు కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, మరింత ప్రజా సేవ చేయాలని తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశలో అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి , మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతఘ్నతలు తెలియ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ,అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తున్నాని ,ని, ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్నామని ,నియోజకవర్గ అభివృద్ధికి శాయషెక్తుల కృషి చేస్తున్నాని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page