SAKSHITHA NEWS

Government Whip Arekapudi Gandhi discussed the development works.

సాక్షిత : GHMC ప్రధాన కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి మరియు స్థితిగతుల పై చర్చించడం జరిగినది అని ,ఇటీవల వర్షాల వలన దెబ్బ తిన్న రోడ్ల ను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని,

రోడ్ల ను వెంటనే పునరుద్ధరించాలని, అదేవిధంగా పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, కొత్త ప్రతిపాదనల పనులకు నిధులు మంజూరి అయ్యేలా చూడలని, చెరువుల సుందరికరణ పనులు వేగవంతం అయ్యేలా చూడలని, అభివృద్ధి పనులలో వేగం పెంచేలా చూడలని,పైన పేర్కొన్న అంశాలను ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


దీనికి సానుకూలంగా స్పందించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ సానుకూలంగా స్పందించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు


SAKSHITHA NEWS