ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

Spread the love

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్, వెన్నెలగడ్డ, అయోధ్యనగర్, వినాయక నగర్ లలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఆయా పాఠశాలల విద్యార్థులకు తెరాస పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి మధుసూదన్ రాజు, సమ్మయ్య నేత, వీరారెడ్డి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ లు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విష్ణుప్రియ, వసంత, రవీందర్, గోపాల్, నాయకులు సిద్దేశ్వర్ గౌడ్, సంతోష్ గౌడ్, స్థానిక నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page