SAKSHITHA NEWS

సాక్షిత : గోకుల్ ప్లాట్స్ కె.పి.ఎచ్.బి కాలనీకి చెందిన బేరచః ఫౌండేషన్ ఆర్గనైజింగ్ వారు 124 డివిజన్ పరిధిలోని HMT W/S MPPS స్కూల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిన కార్యక్రమానికి శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మరియు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొని వారి చేతుల మీదుగా పిల్లలకు పుస్తకాల పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద పిల్లలకు నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తూ తనవంతు సాయమందిస్తున్న పాస్టర్ ఏసుపాదం కి మరియు ఫౌండేషన్ బృందానికి అభినందనలు తెలియచేసారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, యాదగిరి, పోశెట్టిగౌడ్, రాములుగౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు మధులత, రేణుక, సంతోష్, రవీందర్, ఉమేష్, ప్రభుత్వ పాఠశాల ఎచ్.ఎం గాలయ్య మరియు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS