సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి

Spread the love

సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి..
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అనంతం ఆస్పత్రి మెడికల్ సూపరింటెoడెంట్ ఎల్.కిరణ్ కుమార్ ను కలిసి..వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి లోపల అంతా పరిశుభ్రంగా వుంచారని అభినందించారు. ఇలాంటి శ్రద్ధ నే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నాయకులు దుంపల రవి, మంకెన వాసు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page