లక్ష్మీపురంలో ఘనంగా గణేషుని అన్నసంతర్పణ

Spread the love
లక్ష్మీపురంలో ఘనంగా గణేషుని అన్నసంతర్పణ
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద శనివారం ప్రధానార్చకులు పి.సీతారాం మూర్తి ఆధ్వర్యంలో మహిళలు,నిర్వాహకులు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి ఘనంగా పూజలు చేశారు.అనంతరం10 కేజీలు లడ్డును వేలం పాటలో పరపటి.రాము అనే వ్యక్తి 26000/-రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.అదే విధంగా గణపతి మండపం వద్ద సుమారు1500 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులు నిర్వహించారు.అనంతరం గణేషుని మేళతాళాలతో బాణసంచాతో పూలదండ మధ్య ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.అలాగే గణేషుని నిమజ్జన కార్యక్రమం కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page