శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పుణ:నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం

Spread the love

వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన పుణ:నిర్మాణం కు నేడు ఆలయ కమిటీ సభ్యులు తో కలిసి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ , మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కు ఎంతో ఘన చరిత్ర కలిగిఉందని, ఈ ఆలయం నిర్మించాలనే సంకల్పం తో నేడు శంకుస్థాపన చేయటం ఏంతో సంతోషకరమని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం కు గతం లోనే శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారుతన వంతు గా 25 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశానని తెలిపారు.

అంతే కాకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు , దండా బ్రహ్మానందం , రావెల సత్యనారాయణ , నలబోతు వెంకట్రావు , వీరు తమ వంతుగా ఆలయ నిర్మాణం కొరకు 1 కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించడం, అలాగే వారితో పాటు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు కూడా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించటం కూడా సంతోషదాయకమని తెలిపారు. వీరితో పాటు దేవస్థాన నిర్మాణంకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, విరాళాలు ఎవరైనా ఇచ్చే వారు ఉంటే ఆలయ నిర్మాణం కు తమ వంతు సహకారం అందించాలని తెలిపారు…

Related Posts

You cannot copy content of this page