కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love

Former MP Ponguleti’s visit to Kothagudem district

కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

సాషిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం జిల్లాలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో జరిగిన ఊకంటి ప్రభాకర్ రావు నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. అదేవిధంగా బిక్కుమల్ల సత్యనారాయణ దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళ్ళు అర్పించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలం నర్సింహాసాగర్ గ్రామంలో జరిగిన ముత్యాలమ్మ తల్లి బొడ్రాయి ప్రతిష్ఠ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ పర్యటనలో పొంగులేటి వెంట పినపాక మాజీ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జారె ఆదినారాయణ, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, టీవీ సుబ్బారెడ్డి, పల్లపు తిరుమలేష్, కటుకూరి శ్రీనివాసరావు, పూనెం చంద్రశేఖర్, బత్తుల నవీన్, బత్తుల అంజి, తూము చౌదరి, రామనాథం, మైనారిటీ నాయకులు గౌస్భయ్, అయూబ్ ఖాన్, రామ్మూర్తి, దుర్గారాశి సతీష్, నిరంజన్ రెడ్డి, రాము, పండు, కుమార్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page